Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

చదువు ద్వారా ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని చెప్పిన మహాత్మ జ్యోతిరావు పూలేకి దక్కుతుంది.ప్రజా సంఘాల నాయకులు.

చిలకలూరిపేట :మహాత్మా జ్యోతిరావు పూలే 199వ వజయంతి కార్యక్రమంఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని యనార్టీ సెంటర్ లోని సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి. శ్రీను నాయక్ మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఉన్నారు. జ్యోతిరావు పూలే కి నిజమైన పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వం ఆ దిశగా పునరాలోచన చేయాలన్నారు. సమాజంలో ఉన్నటువంటి మూఢవిశ్వాసాలకు, వితంతు వివాహాలకు వ్యతిరేకంగా కృషి చేశారన్నారు. చదువు ద్వారానే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని గ్రహించిన మహానేత జ్యోతిరావు పూలే అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోటా నాయక్,కొండ్రముట్ల నాగేశ్వరరావు, బి.చిన్న నాయక్, సలికినిడి నాగరాజు,ఆర్ మోహన్ నాయక్,గోపి నాయక్,తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.