Listen to this article

జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరంలో

నిషేధిత ప్లాస్టిక్‌ అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ప్రజారోగ్య సిబ్బంది 1,110 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి కొండపల్లి సాంబమూర్తి తన బృందంతో కలిసి నగరంలో శుక్రవారం PW మార్కెట్‌ వద్ద ప్లాస్టిక్‌ విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్‌ను వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌కు తరలించారు.