Listen to this article

జనం న్యూస్ :24 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్;

ఈనెల 26 శనివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో భూంపల్లికి చెందిన కవి వంగరి వెంకటేశం రచించిన సప్తశతి మణిపూసలు పుస్తకావిష్కరణ కలదని బాలసాహితీ వేత్త ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. మణిపూసల కవిత దినోత్సవం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఏడు వందల మణిపూసలు పుస్తకావిష్కరణ జరగడం సంతోషమని ఇట్టి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు బుధవారం అక్భర్ పేట భూఃపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ జల్లిపల్లి బ్రహ్మం అతిథులుగా అడ్డగూడి ఉమాదేవి, ఆశీర్వాదం, వడిచర్ల సత్యం, మచ్చ అనురాధ, దోమకొండ అంజయ్య, నూనే రాజయ్య, ఐత చంద్రయ్య, పట్నం భూపాల్, సంగీతం నరసింహారావు, కుందారం యాదగిరి, సిహెచ్ రాజు, వరుకోలు లక్ష్మయ్య తదితరులు హాజరవుతారని కవులు, రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఇట్టి కరపత్ర ఆవిష్కరణలో పుస్తక రచయిత వంగరి వెంకటేశం, యస్టీయు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్ సిద్దిరామగౌడ్, కిష్టయ్య, నల్ల అశోక్, శ్రీనివాస్ రెడ్డి, బైరి రమేష్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.