

95- 96 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఘనంగా ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్ 01 మే పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995 96 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం రోజున కరీంనగర్ శ్వేత హోటల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులందరూ 30 సంవత్సరాలు ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్న వారంతా ఒకే చోట కలుసుకొని గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవిత స్థితిగతులను తెలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు.అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానం చేసి గ్యాపికను అందించారు. ఈ కార్యక్రమంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులు పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.