Listen to this article

ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు

జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా గజ్వేల్ కష్టపడి చదువుతే విజయం ఎప్పటికైనా సాధించగలమని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవ సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు అన్నారు. 10వ తరగతిలో ప్రథమశ్రేణిలో పాసైన రామకోటి రామరాజు పెద్ద కుమారుడు రామకృష్ణను బుధవారం నాడు శాలువాతో ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు తల్లితండ్రులు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే ప్రంపంచంలో సాధించనిది ఏదీ లేదన్నారు. విజయానికి కారణమైన ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ అంబాదాసు, స్కూల్ ప్రిన్సిపాల్ రెహమత్,కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. పదోతరగతి పాసైనా వారందరికీ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.