

జనం న్యూస్ // మే // 1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
తండ్రి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కాగా, తన తండ్రి బాధలు, తన తండ్రిని గర్వించే విధంగా తన తనయుడు కష్టించి, చదువును ఇష్టపడి, ఎన్నో ఒడిదుడుకుల నడుమ తండ్రి పేరును ఒక అంగుళం పెంచిన తనయుడు సోహెల్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో గత 25 సంవత్సరాలుగా చాలిచాలని వేతనంతో జీవిస్తున్న (తండ్రి పాషా )తన కష్టాన్ని గుర్తించి సోహెల్ పదోవ తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు గాను 570 మార్కులు సాధించడం పట్ల ఎంతో సంతోషం పడ్డారు, సోహెల్ కుటుంబ సభ్యులు, కాగా సోహెల్ కుటుంబ సభ్యులను,జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తో పాటు, మాజీ మున్సిపాలిటీ ఛైర్మెన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోనగంటి మల్లయ్య లు, విద్యార్థి తండ్రి పాషను అభినందించారు.