

జనం న్యూస్, మే 01 (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్):
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్య మంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీ సెక్రటరీగా వేమిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారికంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీ సెక్రటరీగా నియామకం చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు, నాపై నమ్మకంతో నన్ను సిఫార్సు చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి కి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. గిద్దలూరు మునిపాలిటీలో వైసీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రామచంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.