Listen to this article

వైసీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ సెక్రటరీగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి.

జనం న్యూస్, మే 01, (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్):

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన, అత్యంత బలమైన యూత్ లీడర్ మన యువ నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి. గిద్దలూరులో రాజకీయంగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి మన వేమిరెడ్డి రామచంద్రారెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ, పార్టీపట్ల వీర విధేయుడుగా ఉంటూ, ఎంతో క్రమశిక్షణ కలిగిన మన యువ నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి. అతని నిబద్ధతను గుర్తించిన అధిష్టానం గిద్దలూరు నియోజకవర్గంలో మన ప్రియతమ నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడుగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో, గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉండే యువ నాయకులు మన వేమిరెడ్డి రామచంద్రారెడ్డి. అటువంటి యువ నాయకులైన మన వేమిరెడ్డి రామచంద్రారెడ్డికి పార్టీలో తగిన గుర్తింపు, అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన సందర్భంగా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్న వేమిరెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకముతో నాకిచ్చిన పదవికి న్యాయం చేస్తానని అదే విధంగా పార్టీపట్ల విధేయుడుగా ఉండి అధిష్టానం ఆదేశాలను ఎల్లవేళలా శిరసా వహిస్తారని వినమ్ర పూర్వకంగా తెలియ జేసుకుంటున్న వేమిరెడ్డి. కష్టాలు కొత్తేం కాదు, గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఎన్నో కష్టాలని బాధల్ని ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ. “నిలబడతాం, తలపడతాం, పోరాడుతాం, మళ్ళీ గెలుస్తాం” అంటున్న మన గిద్దలూరు యువ నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ “రాష్ట్ర మున్సిపల్ విభాగ సెక్రెటరీ” గా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకొని వెల్లువెత్తుతున్న అభినందనలు.