

దుర్గం.దినకర్ సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…
జనం న్యూస్ మే 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కార్మికులు హక్కుల సాధనకై పారాడుదామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం.దినకర్ పిలిపునిచ్చారు. వాంకిడి మండలంలోని ఖీరిడి గ్రామంలో శాఖ కార్యదర్శి దుర్గం,నిఖిల్ ఎర్రజెండా ఎగురావేసి అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ ముఖ్య అతిథిగా వెళ్లి మాట్లాడుతూ 1886లో చికాగో నగరం లో 8గంటాల పని సాధన కోసం తుపాకీ గుండ్లకు ఎదురేగిన కార్మికులు పెట్టు బడిదారులు ముష్కరుల తుపాకీ గుళ్ళకి గుండె చూపిన దిరులు. ఎరులై పరినా రక్తం నుండి ముంచి ఎత్తిన జెండా ఎర్రజెండా, ఆనాటి స్పూర్తితో అమరుల త్యాగంతో ఆనాడు సాధించుకున్న హక్కుల రక్షణ కోసం ఈనాడు మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందనీ అన్నారు. కార్మికులంతా బానిసలై యంత్రాలలో యంత్రాలై యంత్రాలకు కందనీ ఆవిరై చితికిపోయిన వారే రోజుకు 12 గంటలు ఫాసిస్తూ ప్రభుత్వం చట్టం చేయడం దారుణమాని అన్నారు. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎర్రజెండా యేశాక్తి ఆపలేదని అన్నారు. కార్మికులతో రోజుకు 16 నుంచి 20గంటలు పనిచేయించే వాళ్ళని అన్నారు. పనిచేసే కర్మకారాలలో సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. దీంతో కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన శ్రమను మరవడానికి కాస్త విశ్రాంతి తీసుకున్న దిక్కర నేరం కింద జరిమానా విధించేవారని అన్నారు. నేపథ్యంలో కార్మికులలో తిరుగుబాటు మొదలై కార్మిక ఈ సంఘాల నిర్మాణం ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకున్నారని తెలీపారు. న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని ట్రేడ్ యూనియన్లను గుర్తించాలని కర్మాగారాల్లో కనీస వసతులు కల్పించాలని తగినంత విశ్రాంతిని ఇవ్వాలని కోరుతూ కార్మిక వర్గం విప్లవ శంఖం పూరించిందన్నారు ఈ పోరాటంలో ఎంతోమంది కార్మికులు మరణించినారని తమ హక్కులను సాధించుకున్నారని వారి స్ఫూర్తి కి గుర్తుగా జరుపుకునేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే అన్నారు 1886లో చికాకు కార్మికులు తమ విలువైన నెత్తురును పారించి 8 గంటల పని దినాల హక్కులను సాధించాలని 137 సంవత్సరాల క్రితం సాధించుకున్న హక్కు నిత్యం ఉల్లంఘనలకు గురై నేడు పబ్లిక్ ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా అదనపు విలువను దోపిడీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం నాయకులు.జడి.తిరుపతి,వడ్లూరి,శ్రీకాంత్,బైరాగోనే,తిరుపతి,వెంకటేష్,సురేష్,ఆనంద్,జానికి రావు,సుభాష్, నందేవ్ అనిల్,శ్యామ్ రావు తదితరులుపాల్గొన్నారు.