

జనం న్యూస్, మే 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బుదవారం బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి,గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని, కులగననకు బిజెపి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా బిజెపి ఓబీసీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి సుమతి,బిజెపి సీనియర్ నాయకులు నాగు ముదిరాజ్, నాయిని సందీప్ కుమార్, మాడ్గురి నరసింహ ముదిరాజ్, వడ్డేపల్లి ప్రసాద్, మైస విజయ్, సూర్యారావు, కాళ్ల సాయి, ఆనంద్, సంగిపు అనిల్, గోపాల్, ఏలేశ్వరం ఎల్లం, అరుణ్, రాజేశ్వర్ చారి ఓబిసి, మహిళ, ఎస్సి మోర్చాల అధ్యక్షులు దువ్వల రాజు యాదవ్, కుంకుమ రాణి, గడ్డమీది ప్రశాంత్, మహిళా మోర్చా నాయకురాలు చిన్నోజు నీరజ, వినోద, మమత, సరిత, భక్త మాల, స్వరాజ్యలక్ష్మి, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
