Listen to this article

జనం న్యూస్,మే 02,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

ఈరోజు జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరము నందు రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి మాట్లాడుతూ పోషణ లోపాలు ఉన్న (స్యామ్ మరియు మ్యామ్) పిల్లలను గుర్తించి వారికి ఎన్. ఆర్. సి. ( న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్) కు పంపాలి అని అన్నారు. ఎదుగుదల లో లోపాలు, మానసిక లోపాలు ఉన్న పిల్లల ఉన్నత ఆసుపత్రుల కు చికిత్స కు పంపాలి అని అన్నారు. పుట్టుక లోపాలు అనగా గుండె రంధ్రం, గ్రహణ మొర్రి, వంకర కాళ్లు ఉన్న వారిని ఉన్నత ఆసుపత్రుల కు పంపి శస్త్ర చికిత్సలు చేయించాలి అని అన్నారు. 0 నుండి 6 సంవత్సరముల వయసు గల పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించుచున్నారు. కంటి సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నచో వారికి తగిన చికిత్స అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 7 నుండి నేటి వరకు 298 అంగన్ వాడి కేంద్రం లలో 13,949 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు.ఎదుగుదల లోపాలు ఉన్న పిల్లల 169 మంది పిల్లలను, కంటి సంబంధిత సమస్యలు వున్న వారిని 33 మంది పిల్లలను గుర్తించి చికిత్స నిమిత్తం వివిధ ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరిగింది అని అన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారి డా.బి. కిరణ్ కుమార్, ఆర్. బి. ఎస్. కె. డాక్టర్ లు, ఫార్మసిస్ట్ లు , ఎ. ఎన్. ఎం. లు పాల్గొన్నారు.