

జనం న్యూస్ మే ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో క్యాబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం సబ్ కాసాత్- సబ్ కా వికాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియ చేసిన కొత్తపేట మండల కమిటీ ,కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇళ్ల పల్లంశెట్టి అధ్యక్షత న సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కి శుభాకాంక్షలు తెలియచేసారు. స్వాతంత్ర సిద్ధించిన నాటినుండి నేటికీ కులగణన జరగలేదని 60% ఉన్న బీసీలకు సామాజిక,రాజకీయ ఉద్యోగ న్యాయం జరగడం లేదని సంచార జాతులు కడనున్న వారికి రిజర్వేషన్ ఫలాలు అందాలంటే కులగణన జరగాలని పాలూరి అన్నారు. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ లో తీసుకొన్న నిర్ణయాలకు సంభవించిన వివరాలు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) ను సూపర్ కేబినెట్ గా వ్యవహరిస్తారు. నిన్నజరిగిన భేటీలో కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తుంది.మోదీ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయం వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పిస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణను వ్యతిరేకించి ప్రస్తుతం రాజకీయాలు చేస్తూ కొన్ని రాష్ట్రాలలో కులగణన చేసారు.కానీ వాటి లెక్కల్లో తేడాలున్నాయి అసలు లెక్కలు తేలాలంటే మాత్రం జనాభా లెక్కల తోనే సాధ్యమవుతుందని పాలూరి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నది మోదీ ప్రభుత్వ సంకల్పం ఏప్రిల్ 20 20 లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సిన ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి.ఇప్పుడు కులగణనకు చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి గొల కోటి వెంకటేశ్వరరావు, అన్యం సత్యనారాయణ,కోటిపల్లి సుబ్రహ్మణ్యం, భామిడిపాటి లక్ష్మీనారాయణ, బల్ల రాజు,కుడిపూడి దావీదు, తదితరులు పాల్గొన్నారు.