Listen to this article

రాష్ట్రంలోనే ఆస్తి పన్ను లో జమ్మికుంట ప్రథమ స్థానం..

పలువురి ప్రశంసలు.. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్

జనం న్యూస్ // మే // 1// కుమార్ యాదవ్ // జమ్మికుంట..

తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం మాదిరిగా ఏప్రిల్ నెలలో 5 శాతం రిబేట్ కేటాయించడం జరిగిందని, అందులో భాగంగా 13 కార్పొరేషన్ లతో కలుపుకొని, 151 మున్సిపాలిటీలలో జమ్మికుంట మున్సిపాలిటీ 55.04 శాతంతో మొదటి స్థానంలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వయంగా కొంత మంది బిల్ కలెక్టర్ లకు, వార్డు ఆఫీసర్ లకు ఫోన్ చేసి ఆస్తి పన్ను చెల్లించడంలో మక్కువ చూపడం, మన జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని తెలుసుకొని ఆస్తి పన్ను చెల్లించడం హర్షణీయమన్నారు. తెలంగాణలో సైతం ఆస్తి పన్ను మొదటి సరిగా 55.04 శాతంతో మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. గతంలో ఆస్తి పన్ను వసూళ్లలో సైతం మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఇప్పుడు 5% రిబేట్ లో ఆర్ ఐ, ఆర్ ఓ, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ప్రజలకు ఆస్తి పన్ను వసూళ్లపై వ్యక్తిగతంగా కలిసి వారికి పన్నులు చెల్లించడంలో లాభాలు వారికి క్లుప్తంగా వివరించి, ఆస్తి పన్ను వసూలు చేశారని ఆయన అన్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో మొదటి స్థానం సాధించడం పట్ల సీ.డి.ఏం.ఎ. పలువురు ఫోన్ లో అభిందించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు గాను నేడు జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికై మూడు కోట్ల రూపాయల నిధుల ప్రొసీడింగ్ కాపీని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇంత గొప్ప స్థానాన్ని అధిరోహించడానికి సహకరించిన, మాజీ ప్రజా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, పట్టణ ప్రజలకు, వర్తక, వ్యాపారస్థులకు, మున్సిపల్ ఆర్.ఐ., ఆర్.ఓ., అధికారులకు, వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్.ఐ. భాస్కర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.