Listen to this article

జనం న్యూస్ మే 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

కార్మికుల పోరాటాల ద్వారానే కార్మిక హక్కులను సాధించుకుంటారని పోరాటం చేయకుండా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదని అందుకు కార్మికులు కర్షకులు కలిసి పోరాడాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం అన్నారు. గురువారం సిఐటియు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వివిధ సెంటర్లలో కార్మిక సంఘాల జెండాలను ఎగురవేసి మేడిన ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పూర్వ శ్రీరాములు మాట్లాడుతూ.. అమెరికా చికాగో నగరం లో లక్షలాదిమంది కార్మికులు కంపెనీల యజమానుల వ్యతిరేకంగా రోజుకు 18 గంటల పని దినాలకు వ్యతిరేకంగా 8 గంటల పని దినాలకై పోరాడి ప్రాణాలర్పించిన రోజు అని అన్నారు.సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ.. లక్షలాదిమంది కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను బిజెపి కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు పరచి బడా పెట్టుబడుదారులకు ఉపయోగపడే విధంగా 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చి 12 గంటల పని దినాలకు పెంచే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులకు నష్టదాయకం చేసే చట్టాలను అమలు చేయాలని చూస్తున్నారు వీటికి వ్యతిరేకంగా ఈనెల 20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగినది ఈ సమయంలో కార్మికులు కర్షకులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జె విజయలక్ష్మి చంద్రయ్య,స్టాలిన్ రెడ్డి, కృష్ణారెడ్డి, సైదులు, లింగయ్య, గోపయ్య, నాగయ్య, వెంకట్ రెడ్డి, సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు షేక్ దస్తగిరి, నాగేంద్రబాబు, పాషా మేస్త్రి, నాగరాజు, వెంకటేశ్వర్లు, మైసయ్య గౌడ్, అంజయ్య, జానయ్య, నాగయ్య,రవి, పరశురాములు, రఘు, తదితరులు పాల్గొన్నారు.