

APMCA రాష్ట్ర పిలుపుమేరకు గత ఐదో రోజూ గా CHOs సమ్మీ
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మే 2(రిపోర్టర్ ప్రభాకర్ )
వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద గత ఆరు సంవత్సరాలుగా CHOలుగా పని చేస్తున్న జీతం లో ఎలాంటి పురోగతి లేదు. గత 2 సంవత్సరాలుగా రిప్రజెంటేషన్ ఇస్తున్న జీతాభాత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము, దీనికి సమబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు పార్వతిపురం Manyam జిల్లా APMCA పార్వతీపురం Manyam జిల్లా ప్రెసిడెంట్ చింతల జగదీష్ కుమార్ అధ్యక్షానా సమ్మె కార్యక్రమం చేయడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు మా జిల్లా పరిధిలో ఉన్న CHOs వాళ్ళందరూ సమ్మె కార్యక్రమం చేయడం జరిగింది. 6 సంవత్సరాలు దాటిన CHO లను క్రమంబద్దికరించాలి, NHM లోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల శాలరీ తో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఆర్ధికమైన మరియు ఆర్ధికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలి. ఈ డిమాండ్ లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలియచేస్తున్నాను. వీళ్లకు సంఘీభావం UTF Association MURALI పాల్గొన్నారు.
APMCA వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్,సెక్రటరీ ఇంద్రాణి కోశాధికారి రాజేశ్వరి ,టీ జాకబ్,230 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్.

