

జనం న్యూస్ మే 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై మందిని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం నమాజ్ ప్రార్థన అనంతరం, ఎల్లమ్మ బండ చౌరస్తా లోని మిసైల్ మెన్ ఏ పి జే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాలను పట్టుకుని. పాకిస్తాన్ మర్డబాద్, డౌన్ డౌన్. హిందూస్తాన్ జిందాబాద్ అని హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు.ఉగ్రవాదులకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు.మతంపై ద్వేషం నింపుకొని దాడులు చేయడం దారుణం అన్నారు.పాకిస్తాన్ చేయించినట్టి హే్యమైన చర్యకు పాకిస్తాన్ కి తగిన బుద్ది చెప్పాలని దానికి ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని తెలిపారు.దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని, ఈ దాడులకు బాధ్యులైన తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్లో దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.కార్యక్రమం లో ముస్లిం యువకులు,మత పెద్దలు భారీ గా పాల్గొన్నారు.