

ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన
ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి
జనం న్యూస్, మే 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోటి తలంబ్రాల్లో పాల్గొన్న భక్తులకు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ తలపెట్టిన ముత్యాల తలంబ్రాల పంపిణి కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కళ్యానానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది భక్తులచే 250కిలోల వడ్లను ఓలిపించి కళ్యానానికి అందించారు. గత 26సంవత్సరాలుగా రామ నామాన్ని లిఖింపజెపిస్తున్న రామకోటి రామరాజు నిరూపమాన రామభక్తికి మెచ్చి అపర రామదాసుగా కీర్తించి 100కిలోల ముత్యాల తలంబ్రాలు అందించడం మన గజ్వేల్ గ్రామానికే గర్వకారణం అన్నారు. గోటి తలంబ్రాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన పాల్గొన్న భక్తులకు తిరిగి ఉచితంగా పంపిణీ చేయడం అన్నది రామకోటి రామరాజు చేపట్టిన నిశ్వార్థ రామభక్తి అమోఘం అన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్ సి, రాజమౌళి మాట్లాడుతూ గోటితో వడ్లను ఒలిచే కార్యక్రమం భద్రాచలం వారు రామకోటి రామరాజుకు మూడోసారి అందించడం గర్వకారణం అన్నారు. ఏమి ఆశించకుండా చేస్తున్న సేవకు గాను భద్రాచలం వారు అతని రామభక్తికి మెచ్చి మూడోసారి కూడా 100కిలోల తలంబ్రాలు ఇవ్వడం అన్నది రామభక్తికి నిదర్శనం అన్నారు.
సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ ప్రతి భక్తునిచే రామ నామాన్ని లిఖింపజేయడమే కాకుండ వారందరి భద్రాచల రామయ్య కల్యానానికి కళ్యాన తలంబ్రాలు అందించడం అన్నది ఎవరు చేయలేని పని రామకోటి రామరాజు రామభక్తితో చేయడం అభినందించదగ్గ విషయం అన్నా.
