Listen to this article

.
జనం న్యూస్ మే 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం


తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టిఆర్ పిఎస్) శాయంపేట మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా టిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వల్లకటి రాజకుమార్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన వెలిగించారు.అనంతరం పహల్గాంలో హిందువులు మాత్రమే లక్ష్యంగా సాగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు.అనంతరం టిఆర్పిఎస్ మండల అధ్యక్షులుగా ఎన్నుకోబడిన సామల మధుసూదన్ ను ప్రమాణ స్వీకారం చేయించారు.గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల ప్రసాద్, కందగట్ల ప్రకాష్,ఉపాధ్యక్షులుగా బాసాని చంద్రమౌళి,గుర్రం అశోక్ లతో పాటు నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరైనారు అతిథులుగా చేనేత ఐక్యవేదిక హైదరాబాద్ అధ్యక్షులు రాపోలు వీరమోహన్,మహిళా విభాగం అధ్యక్షురాలు కొండ పద్మ,పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు ఈగ మల్లేశం, తెలంగాణ రాష్ట్ర మినిమం వేజేస్ అడ్వైజరీ మెంబర్ బాసాని చంద్రప్రకాష్ పలువురు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు హాజరైనారు.టిఆర్ పిఎస్ బాసాని సదాశివుడు బాసాని రాజు బాసాని చంద్రమౌళి కందికట్ల ప్రకాష్ రమేష్ మాందరిపేట నుండి బడుగు రవీందర్ అశోక్ మండలంలోని వివిధ గ్రామ నాయకులు కులభాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..