

జనం న్యూస్ మే 3, వికారాబాద్ జిల్లా
పరిగి పట్టణంలోని పరిగి బస్టాండులో గత నెల 17వ తేదీన ఇద్దరు వ్యక్తుల నుండి బంగారం నగలు దొంగలించిన వ్యక్తులు పరిగి పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. ఆంధ్ర రాష్ట్రముకు చెందిన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గిద్దన్న అతని భార్య అగ్రీమ వారి కూతురు కీర్తి గిద్దన్న బావ ప్రసాదులు చాలా రోజుల నుండి రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండులో దొంగతనాలు చేసి తిరిగి వాళ్లు నలుగురు కలిసి కావాలని ఒకరు ఒకరు తోసుకొని గందరగోళం పరిస్థితి సృష్టించి ప్రయాణికులకు దృష్టి మళ్లించి వారి దగ్గర నుంచి నగదు బంగారము వెండి అభరణాలు దొంగతనం చేస్తూ ఉండేవారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిండుతులను పట్టుకొని రిమాండ్ కు తరలించారు.వీరిని పట్టుకోవడానికి కృషిచేసిన పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్, ను సిబ్బంది గోపాల్,జావీద్,బాలు నాయక్,లను పరిగి డిఎస్పి శ్రీనివాస్ అభినందించారు.
