

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
పట్టణంలోని పాటిమీద గల వేంచేసి ఉన్న అంకమ్మ తల్లి పోతురాజు స్వామి వారి 24వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పూజలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిలకలూరిపేట మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. శాసనసభ్యులు పుల్లారావుని ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి దుశ్శాలువాతో సన్మానించారు.ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజలలో పుల్లారావు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పుల్లారావు మాట్లాడుతూ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చాలా చక్కని ఏర్పాట్లు చేశారని కమిటీ సభ్యులను ముఖ్యంగా యువతను అభినందించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అన్నదాన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.