Listen to this article

ఎరువుల దుకాణదారుల డీలర్ల సమావేశంలో హెచ్చరించిన..

ఆందోల్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి..

జనం న్యూస్. మే3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

వచ్చే వానకాల సీజన్లో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు.మరియు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామనిఆందోల్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి హెచ్చరించారు. హత్నూర మండల పరిధిలోని కాసాల రైతు వేదికలో శనివారం ఫర్టిలైజర్స్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. త్వరలో వానాకాలం సీజన్ మొదలు కాబోతున్న దృశ్య రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గోడౌన్ లలో ఎరువులు ఉండేలా ప్రతిపాదనలు పంపాలని తెలిపారు,అలాగే ” 0″ఫామ్స్ ఇంక్లూషన్ ఎప్పటికప్పుడు విడిగా చేసుకోవాలని అన్నారు, ప్రతి ఎరువు దుకాణంలో తప్పనిసరిగా లైసెన్స్ కాపీలను డిస్ప్లే చేయాలన్నారు.నకిలీ విత్తనాలు కొనుగోలుకు సహకరించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడుతుందని అన్నారు. రైతులు కొనుగోలుకు సంబంధించిన.ఎరువులకు , విత్తనాలకు, మరియు పురుగు మందులు కొనుగోలు చేసిన వివరాలు స్టాక్ రిజిస్టర్ లలో వేరువేరుగా నమోదు చేయాలన్నారు. బిల్ బుక్ లో కొనుగోలు చేసిన రైతు వివరాలతో పాటు సంతకాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు, ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి. శ్రీనివాస్ రావు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మహేందర్,మనిషా,రమేష్ , మండల ఎరువుల దుకాణదారులు డీలర్లు తదితరులు పాల్గొన్నారు,