

బిచ్కుంద మే 4 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం
తండ్రిని హత్య చేసిన కొడుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ఘటన జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ జగడం నరేష్ తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్ మండలం లొని కౌలాస్ గ్రామానికి చెందిన బిచ్కుంద రాజేందర్ మార్చ్ నెల 18 వ తేదీన తన తండ్రి అయినటువంటి బిచ్కుంద భూమయ్య తో గొడవ పడి తండ్రి నిద్రపోయిన తరవాత తాడుతో మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి, శరీరం పైన కొడవలి పిడి తో గాయపరచి హత్య చేయగా మార్చ్ 19 వ తేదీ న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, మెడికల్ రిపోర్ట్ వచ్చిన తరవాత నేరస్తున్ని పట్టుకొని విచారించగ తానే తన తండ్రిని హత్య చేసినట్టు ఒప్పుకోగా నిందితుడు రాజేందర్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.