

జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం మండలం ముడిదాం రేమా పేటలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్టించారు. ఈ మహోత్సవంలో గ్రామస్థులు భాగస్వామ్యం కావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, అర్చకులు శాస్తోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిపారు.