Listen to this article

జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లాలో గడిచిన నాలుగు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసాయి.
ఈదురు గాలులతో కూడిన వర్తాలు పడుతుండంతో పలు చోట్ల విద్యుత్‌ స్తంబాలు నేలకొరిగాయి.
మరికొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రాత్రి వేళల్లో విద్యుత్‌ సరఫరాలో ఆటంకం ఏర్పడుతుండడంతో వినియోగదారుల నుంచి అధికారులకు ఒత్తిడి ఎక్కువైంది. దీంతో సిబ్బంది మరమ్మతుల పనుల్లో నిమగ్నమయ్యారు.