Listen to this article

జనం న్యూస్ జనవరి 20 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికాంగ్రెస్ పార్టీ వాళ్లను దొంగలంటూ సంబోధించడం సరికాదు

  • 1969 లో హౌసింగ్ బోర్డ్ ప్రారంభించి 1979 లో నిర్మాణాలు ప్రారంభించిందికాంగ్రెస్ ప్రభుత్వంలో వేలాది ఇల్లు నిర్మించిందిటిడిపి అధికారంలోకి రాగానే వేలం ద్వారా ప్లాట్ల అమ్మకం ప్రారంభించింది
  • హౌసింగ్ బోర్డ్ స్థలాలు వేలం వేసిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే
  • టిడిపిలో అప్పుడు మీరు మున్సిపల్ వైస్ చైర్మన్ కాదా?
  • టిడిపి నుండి టిఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం శుద్ధిచేటు
  • టిఆర్ఎస్ లో చేరిన మీరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పై మాట్లాడే అర్హత ఉందా?
  • దమ్ముంటే ముందు మీరు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి చూపండి
  • ఖాళీ స్థలాలు అంతే కబ్జా చేద్దామని ప్రయత్నిస్తున్నారా?

కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డిపేద, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే వాయిదాల పద్ధతిలో ఇల్లు కేటాయించి రాష్ట్రంలో లక్షలాది మందికి సొంత ఇంటి కల నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. తాజాగా కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించిన తీరు పై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధన అతిక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చట్ట ప్రకారం ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటే కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కు ఇలాంటి ఇబ్బంది వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 1969లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూకట్ పల్లి ప్రాంతంలో హౌసింగ్ బోర్డ్ ద్వారా 1300 ఎకరాలకు పైగా స్థలాన్ని సేకరించి 1979లో అప్పటి ముఖ్య మంత్రి మర్రి చెన్నారెడ్డి హయంలో భరత్ నగర్ నుండి మొదలుకొని కూకట్ పల్లి కాలనీలో నిర్మాణాల ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి హాయంలో ఒక ఒక్క నిర్మాణం సైతం నిర్మించలేదు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాయంలో మలేషియన్ టౌన్షి పేరిట నిర్మించిన ఐజయం సంస్థకు 37 ఎకరాలు కేటాయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆలయాలు, మసీదులు, చర్చ్ లకు ప్రభుత్వం అధికారికంగా స్థల కేటాయింపులు జరుపదని, హౌసింగ్ బోర్డ్ సలాం ప్రభుత్వ ధన నిర్ణయించిన నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లిస్తే కేటాయించే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఇంకా టిడిపి వాసన పోలేదని, టిడిపిలో గెలుపొంది టిఆర్ఎస్ లోకి వెళ్లి ఇంకా టిడిపి నాయకులతో దోస్తానా చేస్తున్న మీకు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం పక్కన బెట్టి దమ్ముంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కొన ఊపిరితో ఉందని అందుకే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మతి భ్రమించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై దొంగలు అంటూ పరుష పదజాలంతో మాట్లాడడం ఆయన దివాళకోరు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ దుకాణం బందు కావడం ఖాయమని భావించి 1999లో అభివృద్ధి చేశానని చెబుతూ తిరిగి టిడిపిలోకి వెళ్తావా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసభ్య పదజాలంతో విమర్శిస్తే భవిష్యత్తులో రాజకీయ పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.