Listen to this article

జనం న్యూస్: 14 మే బుధవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :

వేసవికాలంలో విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేయకుండా వారిలోని ప్రతిభను వెలికితీయడంతోపాటు మరింత నైపుణ్యాన్ని పెంపొందించడానికి చేతిరాత శిక్షణ శిబిరం ఎంతగానో తోడ్పాటు నిస్తుందని, సిద్దిపేటకు చెందిన చేతురాత నిపుణులు క్యాతం అశోక్ అన్నారు వేసవి కాల చేతిరాశిత శిక్షణ శిబిరాన్ని స్థానిక స్పైస్ వరల్డ్ స్కూల్స్ గణేష్ నగర్ లో ఏప్రిల్ 25వ తేదీన ప్రారంభించారు. ఈ శిబిరంలో తెలుగు హిందీ ఇంగ్లీష్ చేతిరాతను సులభ పద్ధతిలో నేర్పడంతోపాటు పద్యాలు నీతి కథలు నైతిక విలువలు చిత్రలేఖనం ఏకాగ్రతను పెంపొందించే అంశాలను నేర్పుతున్నారు చేతిరాత నిపుణులు క్యాతంఅశోక్ మాట్లాడుతూ చేతిరాత ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని మానసిక ప్రశాంతతతో పాటు వ్యక్తిత్వ వికాసానికి చేతిరాత దోహదం చేస్తుందన్నారు. పరీక్షల్లో అధిక మార్కులు రావాలంటే చేతిరాత బాగుండాలని అందుకని ప్రతి విద్యార్థి తమ చేతిరాతను అందంగా మలుచుకోవాలని తద్వారా అధిక మార్కులను సాధించవచ్చు అని సూచించారు కార్పొరేట్ స్కూల్లోని విద్యార్థులు లూసీడా రైటింగ్ వారి ప్రత్యేకత అయితే సాధారణ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా అలాంటి లూసీడా రైటింగ్ ని సులభమైన పద్ధతుల్లో ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులకు లుసిడా రైటింగ్ ని నేర్పడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో వేలమంది విద్యార్థుల చేతిరాతను మార్చానని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో చదువుతున్న విద్యార్థులకి సులభమైన పద్ధతిలో చేతిరాతన నేర్పారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 మంది విద్యార్థులకు 2019 సంవత్సరంలో నిర్వహించిన సమ్మర్ సమురాయ్ క్యాంపులో చేతిరాతను నేర్పించడం జరిగింది. అలాగే గజ్వేల్ మంజీరా మరియు ప్రగతి విద్యాలయం విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుల కు కూడా చేతిరాత శిక్షణ ఇవ్వడం జరిగిందని,2020 సంవత్సరం నుండి వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాలలో వచ్చిన ప్రతి విద్యార్థి తమ చేతిరాతనుఅందంగా మార్చడం క్యాతం అశోక్ యొక్క ప్రత్యేకత,ఆన్లైన్ చేతిరాత శిక్షణ ద్వారా హైదరాబాద్ మహబూబ్నగర్ వరంగల్ నిజామాబాద్ వంటి అనేక ప్రదేశాల నుండి విద్యార్థులు ఆన్లైన్లో శిక్షణ తరగతుల ద్వారా తమ చేతిరాతను మార్చుకోవడం జరిగిందని క్యాతంఅశోక్ తెలిపారు.