Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం ఉదయం నుండి ఏసీబీ డి.ఎస్.పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేపట్టారు. సోదాలు అనంతరం పత్రిక సమావేశం లో మాట్లాడుతూ ఇసుక ట్రాక్టర్ల మామూళ్ల వసుల్లా పై ఫిర్యాదు నేపథ్యంలో సోదాలు చేపట్టినట్లు ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఇటీవల అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోగా వాటిని వదిలేందుకు డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఎసిబి అధికారులు విచారణ చేపట్టినట్టు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ కు పక్కనే గల సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి ఆధ్వర్యంలో భాగంగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఇక్కడ జరిగిన అవకతవకలపై ఉన్నత అధికారులకు తదుపరి చర్యలు నిమిత్తం సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు.