

జనం న్యూస్ మే 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
నిర్మల్ జిల్లా మధోల్ నియోజకవర్గంలోని రాళ్ల బోరిగాం గ్రామ దళితులపై దాడి చేసిన అగ్రవర్ణాల గుండాలను వెంటనే కఠినంగా శిక్షించాలని బౌద్ధ, అంబేద్కర్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు, బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సోమవారం రోజు వైశాఖ బౌద్ధ పూర్ణిమ సందర్భంగా గ్రామ దళితులందరూ కలిసి బుద్ధుని విగ్రహాన్ని, ఏర్పాటు చేసుకొని బుద్ధిపూర్ణిమ జరుపుకోగా ఇది జీర్ణించుకోలేని అగ్రవర్ణాల వారు కుల దుర అహంకారంతో దళితులపై దాడి చేయడం చట్ట రుద్దమని , అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా కొంతమంది ఆర్ఎస్ఎస్ ,బజరంగదళ్ గూండాలు దళితులు బౌద్ధ పౌర్ణమి జరుపుకోవడం నచ్చక దాడి చేశారని , అలాగే అక్కడి నుండి బుద్ధుడి విగ్రహాన్ని తొలగించడం సరికాదని ఇలా చేసుకుంటా పోతే ప్రతిదాడి తప్పదని వారిచ్చేరించారు. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం వల్ల అగ్రవర్ణాల వారికి ఏమి నష్టం జరిగిందని,విగ్రహాన్ని తొలగిస్తే అక్కడ ఇంకా ఇతర విగ్రహాలు ఉండకుండా ప్రభుత్వ అధికారులు కట్టిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దళితులపై జరిగిన దాడిని సవాల్గా తీసుకొని పోలీస్ శాఖ వెంటనే స్పందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహ సభ జిల్లా అధ్యక్షలు అశోక్ మహల్కర్, సమతా సైనిక దళ్ జిల్లా ఇన్చార్జ్ దుర్గం సందీప్, భారతీయ బౌద్ధమసభ ఉపాధ్యక్షులు వినేష్, శ్యామ్ రావు లాహు దుర్గే, అంబేద్కర్ సంఘం కార్యదర్శి రామ్ టీం కి ప్రతాప్,నాయకులు రోషన్ ఉప్రే, సురేందర్ ఉప్రే, బల్వంత్, పోచాలు, మనోజ్, చింటూ, స్వాగత్, వివేక్, అన్నారావు, సంజు, మోను, మారుతి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.