Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్.

జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు
విజయనగరం పట్టణానికి చెందిన కింతాడ అంజిబాబు (72సం.లు)కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.1,000/-లు జరిమానా విధిస్తూ మే 14న తీర్పు వెల్లడించి నట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ మే 14న తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం పట్టణానికి చెందిన నిందితుడు కింతాడ అంజిబాబు (72 సం.లు) అనే వ్యక్తి
ఇంటి మేడపై ఆడుకుంటున్న ఆరు సం.ల మైనరు బాలికను లైంగికంగా వేధించినట్లు బాలిక తల్లి విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ కె.టి.ఆర్ లక్ష్మి పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలించి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.ఈ కేసులో ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు చర్యలు చేపట్టగా,నిందితుడు కింతాడ అంజిబాబు (72సం.లు) మైనరు బాలికను లైంగికంగా వేధించినట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి గారు నిందితుడికి 3సం.లు కఠిన కారాగారం మరియు రూ.1000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్టా ఖజానారావు వాదనలు వినిపించగా, మహిళా పోలీసు స్టేషన్ డిఎస్పీ ఆర్.గోవిందరావు పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్
జి.ఎస్.నాయుడు, సి.ఎం.ఎస్. హెడ్ కానిస్టేబులు సిహెచ్. రామకృష్ణ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చా రన్నారు. కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్షపడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారు లను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ అభినందించారు.