Listen to this article

వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది

ఇళ్లపై ఆరుబయట పడుకునే వారు జాగ్రత్తలు పాటించండి

రైతులు బావుల దగ్గర మోటార్లు,ఇతర సామాగ్రి భద్రపరచుకోవాలి

పశువులను రోడ్లపై రాకుండా చూసుకోవాలి

మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్

జనం న్యూస్ మే 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

వేసవి కాలం కావడం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని,మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.వేసవిలో చల్లగాలికి ఇళ్ళపై పడుకునేవారు,వివిధ శుభకార్యాలకు ప్రయాణాలు చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.రైతులు వ్యవసాయ బావుల వద్ద మోటార్లను ఇతర పరికరాలను ఉంచకుండా ఇంటి వద్ద భద్రపరుచుకోవాలని,వరికొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,ఎవరూ నిప్పు పెట్టవద్దని, మేతకు పశువులను వదిలిపెట్టడంతో అవి దొంగలించబడే అవకాశం ఉందని,జాతీయ రహదారిపైకి రాత్రి వేళ పశువులు రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,పశువుల జాగ్రత్తగా
చూసుకోవాలన్నారు.అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉందని రైతాంగం, అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలని,ఎవరైనా అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో కనిపిస్తే పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని,డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయాలని సూచించారు.తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షం ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని ఎస్సై తల్లిదండ్రులకు సూచించారు.