Listen to this article

జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి

జనం న్యూస్ మే 16, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో


విధుల దుర్వినియోగానికి పాల్పడిన రెబ్బెన మండలం కొండపల్లి  గ్రామ కార్యదర్శి ఎం. నమృత (అప్పటి ఇందిరానగర్) ను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి ప్రకటనలో తెలిపారు.గతంలో రెబ్బెన మండలం ఇందిరా నగర్ గ్రామపంచాయతీలో వృద్ధాప్య పింఛన్ 24 వేల 192 రూపాయలు, దివ్యాంగ పింఛన్ 48 వేల 192 రూపాయలను సంబంధిత పింఛనుదారులు చనిపోయిన తర్వాత వివరాలను తొలగించకుండా పంచాయతీ కార్యదర్శి వేలిముద్రతో విత్ డ్రా చేయడం జరిగిందని, జిల్లా గ్రామీణ అభివృద్ధి విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.