Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద కళాశాల అడ్మిషన్లు పెంపే లక్ష్యంగా అధ్యాపకులు కళాశాల ప్రిన్సిపల్ కే అశోక్ , వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి వెంకటేశం మరియు అధ్యాపక బృందం నేడు ఇంటర్‌ పాసైన విద్యార్థుల గ్రామాలు పుల్కల్ ,పెద్దదేవాడ ,చిన్న దేవాడ ,దడిగి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కళాశాలలోనీ గ్రూపుల వివరాలు, సదుపాయాలను వివరించారు .ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియచేశారు