

జనం న్యూస్ 17 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషనులో 2021లో నమోదైన దొంగతనం కేసులో నిందితులకి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తే. 16-05-2025దిన విజయనగరం ఎస్.జె.ఎఫ్.సి.ఎమ్. (మొబైల్) కోర్టు జడ్జి తీర్పును వెల్లడించినట్లుగా విజయనగరం 1వ పట్టణ సి.ఐ ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం పట్టణంపరిధిలో కె. ఎల్ పురంలో జరిగిన దొంగతనం కేసులో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి 1వ పట్టణ ఎస్ఐఐ రాజా సుబ్రమణ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి నిందుతులను అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకొని, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసినారు. ఈ కేసులో నిందుతులు విజయనగరం పట్టణానికి చెందిన (ఏ1) అము జూరి కుమార్ (ఎ2) కె.దేవిప్రసాద్, (ఎ3) ఎం. చిట్టిబాబుడు, (ఎ4) బి.దుర్గా ఉపేంద్రల పై నేరారోపణలు రుజువు కావడంతో నిందితులకి 6 నెలలు జైలుశిక్ష, విధిస్తూ విజయనగరం ఎస్.జె.ఎఫ్.సి.ఎమ్. (మొబైల్) కోర్టు జడ్జి పి.బుజ్జి గారు తీర్పును వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు శాంతి గౌతమి వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబుల్ ప్రవంతి సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పర్చారని విజయనగరం 1వ పట్టణ సి.ఐ ఎస్.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 : లైంగిక వేదింపుల కేసులో నిందుతులకి జైలు శిక్ష, జరిమానా విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషనులో 2020లో సమోదైన లైంగిక వేధింపుల కేసులో నిందితులకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.1000/-లు జరిమానా విధిస్తూ తే. 16-05-2025దిన విజయనగరం ఎస్.జె.ఎఫ్. సి.ఎమ్. (మొబైల్) కోర్టు జడ్జి తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం 1వ పట్టణ సి.ఐ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం పట్టణం కంటోన్మెంటు ప్రాంతానికి చెందిన ఒకామెను విజయనగరం పట్టణానికి చెందిన (ఎ1) ఆర్జి సూర్యనారాయణ (ఏ2) అర్జి లక్ష్మి ప్రసన్న అను ఇరువురు ఆస్తి విషయమై తనతో గొడవ పడి, తనను లైంగికంగా వేధించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి 1వ పట్టణఎస్ఐ బి.దేవి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి నిందుతులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసినారు. ఈ కేసులో నిండుతులు పట్టణానికి చెందిన (ఎ1) ఆర్థి సూర్యనారాయణ (ఏ2) అర్జి లక్ష్మి ప్రసన్నల పై నేరారోపణలు రుజువు కావడంతో నిందితులకి రెండు సంవత్సరావు జైలుశిక్ష, రూ.1000/-లు జరిమానా విధిస్తూ విజయనగరం ఎస్.జె.ఎఫ్.సి.ఎమ్. (మొబైల్) కోర్టు జడ్జి పి. బుజ్జి గారు తీర్పును వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు శాంతి గౌతమి వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబుల్ స్రవంతి సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పర్చారని విజయనగరం 1వ పట్టణ సి.ఐ ఎస్.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.