

సి ఐ టి యు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్..
మార్కెట్ యాడ్ ఎదుట సిఐటియు ధర్నా..
జనం న్యూస్ 20 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
కేంద్రంలోనీ బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట లేబర్ కోడ్ లను రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఎలుకతుర్తి సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాగుల రమేష్ మాట్లాడుతూ 11 సంవత్సరాల బిజెపి పాలనలో కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ యాజమాన్యాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేసేటువంటి విధంగా నరేంద్ర మోడీ పరిపాలన ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పెరిగే ధరలను నియంత్రించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను ఎక్కువగా మంజూరు చేయాలని, ఈ సందర్భంగా రమేష్ డిమాండ్ చేశారు రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మోడీ విధానాలను నిరసిస్తూ జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేను జయప్రదం చేయాలని రాకుల రమేష్ ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పుల్లా అశోక్ మండల నాయకులు శనిగరం రాజయ్య రాజ్ కుమార్,ముదురుకుల యాదగిరి,సమ్మయ్య,రాజయ్య,సూర్య కిరణ్, కర్ణాకర్,రాజు,శ్రీకాంత్, అంబాల రాజు, స్వరూప నాతోపాటు కార్మికులు పాల్గొన్నారు