

జనం న్యూస్ మే 20(నడిగూడెం)
నడిగూడెంలో మట్టిలోడుతో టిప్పర్లు నిరంతరం రాకపోకలు కొనసాగిస్తున్న కారణంగా దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు దుమ్ము లేవకుండా రహదారులపై వాటర్ ట్యాంకర్ తో నీళ్లు చల్లించి సమస్యను పరిష్కరించారు. సమస్య ను వెలుగులోకి తెచ్చి పరిష్కరింపజేసిన బెల్లంకొండ సత్యనారాయణను పలువురు అభినందించారు.