Listen to this article

జనం న్యూస్ 21 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సురేశ్‌, AIFTU రాష్ట్ర నాయకుడు బెహరా శంక్షర్రావులు డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ… ఉగ్రవాద దాడులు కారణంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో నేడు జరగాల్సిన దేశ వ్యాప్త సమ్మెను వాయిదా వేశామన్నారు.