

జనం న్యూస్ మే 21:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండల కేంద్రంలో శివ పంచాయతన అంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలుజరుగుతున్న సందర్బంగా బుధవారం రోజునా ఈ కార్యక్రమలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి మరియు జిల్ల తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మరియు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వారిని శాలువా తో సన్మానం చేసి ఆంజనేయ స్వామి మెమెంటోని అందజేశారు తర్వాత వారు మాట్లాడుతూ దేవునిఆశీర్వాదలు ఎల్లవేళలా ఈ గ్రామము పైన మరియు రాష్ట్రము పైన ఉండాలని ఈ సంవత్సరము కూడా మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు శివాన్నోళ్ళ శివకుమార్, మాజీ జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, ముస్కు మోహన్ రెడ్డి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్ మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
