Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

భారతదేశం పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరలపై విజయవంతంగా నిర్వహించిన “ఆపరేషన్ సింధూర్” ను పురస్క రించుకొని ఈరోజు నందలూరులో NDA కూటమి పార్టీల నేతృత్వంలో “తిరంగా యాత్ర” ను ఘనంగా చేపట్టారు.ఈ యాత్ర అరవపల్లి కృష్ణ మందిరం వద్ద ప్రారంభమై నందలూరు బస్టాండు మీద సాగి మూడు రొడ్ల వద్ద ముగిసింది.కూటమి నాయకులు మరియు ప్రజలు కలిసి జాతీయ జెండాలు పట్టుకొని,నినాదలతో పాదయాత్రగా వెళ్లారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఈ తిరంగ యాత్ర చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ,ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకి శ్రద్ధాంజలి అర్పించి, దేశ భక్తిని ప్రోత్సహించటమే అని అన్నారు.అదేవిధంగా ఈ యాత్ర చేపట్టడం ద్వారా భారత సైనికుల సాహసన్ని, ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం దృడతను ప్రజలకు తెలియజేస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో దేశ భద్రతపై మన నమ్మకం మరింత బలపడిందని పేర్కొన్నారు.