Listen to this article

జనం న్యూస్ 23 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఎండీయూ వ్యవస్థను రద్దు చేయాలన్న ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎండీయూ అపరేటర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. గురువారం విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు బియ్యం సరఫరా చేస్తున్న ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం అన్యాయమన్నారు. దీనివల్ల 27 వేలమంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.