Listen to this article

జనం న్యూస్ మే 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని కొప్పుల గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం గ్రామ ఇంచార్జులు చల్లా చక్రపాణి, పోతు కృష్ణమూర్తి ల ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ఏరుకొండ శంకర్, ప్రధాన కార్యదర్శులు చాడ రాంరెడ్డి, పిట్టల నరేష్, ఉపాధ్యక్షుడు మామిడి రవి, సహాయ కార్యదర్శి గుండా ప్రవీణ్, కోశాధికారి అలువాల భాస్కర్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన అందరికీ కృత్ఞతలు తెలిపారు. పార్టీ ని మరింత బలోపేతం చేస్తానన్నారు.అలాగే గ్రామ అనుబంధ కమిటీ ఎస్సీ, బీసీ, మైనార్టీ, మహిళా విభాగం కమిటీలు వేశారు ఈ కార్యక్రమంలో కళ్లెపు వంశీ, వంగాల తిరుపతి రెడ్డి, వేములపల్లి రవీందర్, సురేష్, కొమురయ్య, శానబోయిన ఆగయ్య, గండి రాజు తదితరులు పాల్గొన్నారు…..