

ఏపీ స్టేట్ బ్యూరో/ రామిరెడ్డి, మే 23, (జనం న్యూస్):
అందరివాడు మన కుందురు, అందరికి అందేవాడు మన కేపీ నాగార్జునరెడ్డి, కష్టం వస్తే నేను మీకు అండగా ఉంటా అంటాడు మన కుందురు నాగార్జునరెడ్డి. మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జునరెడ్డి, రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కేపీ అంటేనే అందరివాడు అని చెప్పవచ్చు. కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి ఎవరికి ఏ కష్టం వచ్చినా,నేను మీకు అండగా ఉంటానని తెలియజేశారు. గిద్దలూరు నియోజకవర్గ స్ధాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు గాని, కార్యకర్తలకు గాని, ఎలాంటి ఏ చిన్న ఇబ్బంది కలిగిన పూర్తిస్థాయిలో, వారికి అండగా ఉంటూ, గిద్దలూరు నియోజకవర్గ స్థాయిలోని కార్యకర్తలు, నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పని చేసే నాయకులను, కార్యకర్తలను తప్పక గుర్తుపెట్టుకుంటామని, ఈ విషయంలో ఎవరు సందేహ పడవలసిన అక్కర్లేదని తెలియజేశారు. ప్రతిక్షణం,మీ అందరికీ తోడుగా, నీడగా, ఒక సోదరినిగా ఏ చిన్న కష్టం వచ్చినా నేను మీ అందరికీ అండగా ఉంటానని, నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు. వారందరికీ నా సహకారం ఉంటుందని తెలిపారు. అందుకే కుందురు నాగార్జునరెడ్డి మన అందరివాడు అయినారు. కేపీ అంటేనే ఒక ప్రత్యేకమైన లీడర్. కేపీ రాజకీయాలలోకి రాకముందు, తాను సంపాదించిన సంపాదనలో, కొంత ప్రజా సేవకు ఉపయోగించాలని, పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు, మార్కాపురం పట్టణ ప్రజలకు నీటి కొరత లేకుండా, తన సొంత ఖర్చుల ద్వారా నీటి ట్యాంకర్లను ఏర్పాటుచేసి, ప్రజలకు నీటి సమస్య లేకుండా చేసిన ఒక గొప్ప మానవతావాది అని చెప్పవచ్చు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును, దృష్టిలో ఉంచుకొని ఎంతో మంది విద్యార్థులకు సహాయము చేయడమనేది ఓ గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఎంతోమంది కుటుంబాలకు సహాయం చేసిన చరిత్ర, మన కేపీ లాంటి నేతకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ప్రజలకు మరింత సేవ చేయాలంటే రాజకీయాలు అవసరమని భావించి, మార్కాపురం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున, పోటీ చేసి సంచలన విజయం సాధించి, ప్రజాసేవకు పూర్తిస్థాయిలో శ్రీకారం చుట్టినారు. మార్కాపురం నియోజకవర్గంలో “కేపీ” అనే పేరు ఒక సంచలనంగా మారినదని చెప్పవచ్చు. మార్కాపురం నియోజకవర్గంలో కేపీ కుటుంబం పూర్తిగా రాజకీయనికి శ్రీకారం చుట్టి నిరంతరము, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు పర్యటనలు ప్రారంభించిన కేపీ నాగార్జునరెడ్డి. సుపరిపాలనలో ముందుకు అడుగు వేశారని గర్వంగా చెప్పుకోవచ్చు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని మారుమూల ప్రాంతాలను సందర్శిస్తూ, కులాలకు, మతాలకు, అతీతంగా రాజకీయ ప్రస్తావన కొనసాగించడం, అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయడం, నియోజకవర్గస్థాయిలో ఒక సామాన్యుడిగా, అందరిలో కలిసిపోవడం ప్రతి కార్యకర్తను, నాయకుడిని పేరు పెట్టి పిలవడం ఆయనకు తప్ప ఎవరికీ సాధ్యముకాదు. నియోజకవర్గస్థాయిలో ప్రతి గడప గడపకు వెళ్లడంలోనే కేపీ నాగార్జునరెడ్డి మన అందరికి అందేవాడుగా సంచలనం సృష్టించారు, అని చెప్పవచ్చు. మార్కాపురం నియోజకవర్గంలో కేపీ నాగార్జునరెడ్డి స్థానము, పదిలం అని చెప్పవచ్చు. రాజకీయ సమీకరణాల దృష్ట్యా
కుందురు నాగార్జునరెడ్డి గిద్దలూరు నియోజకవర్గము నుంచి పోటీ చేయడం జరిగింది. కానీ అక్కడ పరాజయం పొందినప్పటికీ నిరుస్హ పడకుండా, గిద్దలూరు నియోజకవర్గంలో అన్ని కులాలను, మతాలను కలుపుకుంటూ నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేయడం వల్ల, ఇలాంటి ఒక మంచి నాయకుడికి మనం ఓటు వేయకపోవడం అనేది దురదృష్టమని, ఇప్పటికీ గిద్దలూరు నియోజకవర్గ ప్రజల మనసులో భావన అని చెప్పవచ్చు. గిద్దలూరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను, నిరంతరము సందర్శిస్తూ, కార్యకర్తలకు, నాయకులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై స్పందిస్తూ, గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం “కేపి” అంటేనే అందరివాడు అని గర్వంగా చెప్పవచ్చు.
