Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 23 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ వారి( దిశ ) పర్యవేక్షణలో ఈరోజు 22/5/25 చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామం నందు నవ చైతన్యం కళాజాతర బృందం వారు జానపద గేయాలు ద్వారా వీధి నాటకాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ వీధి నాటకము ద్వారా హెచ్ఐవి /ఎయిడ్స్ ఎలా వస్తుంది , ఎలా రాదు , తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు సమాజంలో హెచ్ఐవి వారిపై ఉన్న చిన్నచూపు వివక్షతను చూపకూడదని చట్టం 2017 యాక్ట్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు మరియు సుఖ వ్యాధుల సమాచారం ,కండోమ్ గురించి అవగాహన,చికిత్స విధానాల గురించి మరియు క్షయ వ్యాధి తీసుకోవలసిన జాగ్రత్తలు వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ స్కీం ప్రాజెక్ట్ డిఆర్పి ఎం వాసుదేవరావు సిహెచ్ అశోక్ కుమార్ జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు లింక్ వర్కర్స్ యస్ గాయత్రి , జాన్ బనియన్ మరియు ఎఎన్ఎం లు పి రాజకుమారీ వి సరోజినీ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని నిర్వహించారు