

ఎంఈఓ విఠల్
జనం న్యూస్ మే 24 చిలిపిచేడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా చిలిపిచెడ్ మండల శిక్షణ కార్యక్రమం ఎంఈఓ విఠల్ సర్ గారి నేతృత్వంలో కేజీబీవీ చిట్కుల్ కేంద్రంగా శనివారంతో విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విఠల్ సార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ , విద్యా బోధనలో నూతన మెలుకువలు,పద్ధతులు పాటిస్తూ ప్రణాళికబద్దంగా బోధిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించాలని, ఖచ్చితమైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు మరింత బలపడే విధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఏఐ ఆదారిత విద్యను అందించాలని, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జూన్6 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల నమోదు సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్స్ గా సునీల్,నాగేందర్,సుజాత,మహేష్,వెంకటకృష్ణ,పండరి,యాదయ్య, నవీన్ లు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఆర్పీలు మల్లేశం ,రాజశేఖర్ , మండల ఎంఆర్సి సిబ్బంది ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు