

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,మే 26,అచ్యుతాపురం:
యలమంచిలి నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వివిధ శాఖలు అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేటట్లు అధికారులు చూడాలని, అదేవిధంగా డ్రైనేజీలు, కాలువలు,రోడ్లమీద చెత్త లేకుండా శానిటేషన్ చేయాలని,గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శిలను ఆదేశించారు.ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు తగు సూచనలు చేయడం జరిగిందని, ప్రజల ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఎవరికి ఇబ్బంది కలిగిన తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.