

జనం న్యూస్,మే26,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటి కుళాయిలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. సుమారుగా ఐదు వందల ఇల్లులకు సుమారుగా రూ.80 లక్షలు నిధులతో పనులు ప్రారంభం చేశారు.తడి,పొడి చెత్త ప్లాస్టిక్ బుట్టలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గండి బోయిన భాను వెంకట్, ఒడిశిల సన్యాసిరావు మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు, వైస్ సర్పంచు చొప్ప గురునాథం, కాకి నూకరాజు,గెద్దాడ నూకరాజు,ఎల్లా లోకనాథం,కాకి శంకర్, అనుసూరి రమణ, వడిసెల నాగేశ్వరరావు, నాగేశ్వరరావు,
పత్రి సింహాసనం, రామస్వామి,ముత్తయ్య మరియు అధికారులు, కూటమి నాయకులు,
గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.