

జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
మర్కుక్ మండల కేంద్రానికి చెందిన ఎరుకలి రాజయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు,మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి 10000 రూపాయలు ఆర్థిక సాయం మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ అందజేశారు. పాపోల్లా రాజు బబ్బురి శ్రీనివాస్ , సుర్వి బాలనర్సయ్య, పుట్ట రవి, కర్ణాకర్, బాబు, భద్రయ్య తదితరులు ఉన్నారు.