Listen to this article

జనం న్యూస్ మే(28) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం

అర్వపల్లి మండలం బొల్లంపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో నెలరోజు దాటిన ధాన్యం కాంటాలు వేయకపోవడంతో అకాల వర్షంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మొలకెత్తిన ధాన్యం బస్తాలతో నేషనల్ హైవే 365 జాతీయ రహదారిపై బుధవారం రైతులు ధర్నా నిర్వహించినారు. కాంట వేసిన రైతుల పేర్లు ట్యాబ్ లో ఎంట్రీ చేయకపోవడంతో అకౌంటబుల్ జమ కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చావే శరణ్యం అంటూ చింతల సైదమ్మ అనే మహిళ రైతు పురుగుల మందు డబ్బుతో నిరసనకు దిగింది.అలాగే ఒక బస్తాకు మూడు కేజీలు ధాన్యం కట్ చేస్తున్నారని రైతులు తెలిపారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని ధాన్యం కాంటాలు తొందరగా అయ్యేటట్టు కొనుగోలు చేయాలని కోరారు.