

జనం న్యూస్,మే28,జూలూరుపాడు:
ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చీమలపాటి బిక్షం మాట్లాడుతూ జూలూరుపాడు మండల రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడి పై పచ్చిరొట్ట, జిలుగు విత్తనములు 733 సంచులు అందుబాటులో ఉన్నవి. ఓక్కొక్క సంచికి 30 కేజీలు, ధర రూ.4275.00, సబ్సిడీ పై రైతులకు ఒక్కటి 30 కేజీలు రూ.2137.50 లు రైతు చెల్లించాలు కావున ది 29-05-2025 మధ్యాహ్నం గం.12.00 ల నుండి విక్రయించబడును. విత్తనములు కావలసిన వారు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకము జిరాక్స్ కాఫీలు మండల వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చి కూపను తీసుకొని సొసైటీ నందు అట్టి కూపన్ ఇచ్చి విత్తనములు తీసుకొనగలరని మండల రైతు సోదరులకు తెలిపారు.