

జనం న్యూస్ మే 30:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: బట్టాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా లబ్ధిదారులతో శుక్రవారం రోజునా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బాలే శ్రీనివాస్, సీనియర్ నాయకుడు షేక్ కరీం మాట్లాడుతూ తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని అన్నారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఫీ, చిలుక ప్రసాద్, లబ్ధిదారులు,తదితరులుపాల్గొన్నారు