

జనం న్యూస్ 01 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
పరవాడ సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన రాంబాబును అరెస్ట్ చేసినట్లు DSP విష్ణు స్వరూప్ తెలిపారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుశంభానికి చెందిన M. రాంబాబు అగనంపూడిలో ఉంటున్నాడు. కూలీలు, ఉద్యోగుల ఇళ్లనే టార్గెట్గా చేసుకొని 7 చోట్ల చోరీకి తెగపడినట్లు గుర్తించారు.
శనివారం మంత్రిపాలెంలో అరెస్ట్ చేసి 10.5 తులాల బంగారు ఆభరణాలు, 39 తులాల వెండి వస్తువులు, రూ.1.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.